EAPCET-2025 ఫలితాలు విడుదలకు సిద్ధం: మే 15న రిజల్ట్స్ ప్రకటించనున్న అధికారులు
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన EAPCET-2025 పరీక్ష ఫలితాలు మే 15న విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని పరీక్షా నిర్వహణ అధికారికంగా ప్రకటించారు.
ఈ ఏడాది పరీక్షకు విద్యార్థుల స్పందన విశేషంగా ఉండగా, ఇంజనీరింగ్ విభాగంలో 94.04%, అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాల్లో 93.59% మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఇప్పటికే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాలకు సంబంధించి ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నాపత్రం, రెస్పాన్స్ షీట్లు అధికారులవారి ద్వారా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక, ఈ రోజు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేయనున్నట్టు సమాచారం.
ఈ ఏడాది EAPCET-2025కు రాష్ట్రవ్యాప్తంగా గణనీయమైన స్పందన లభించింది. మొత్తం 3,06,796 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో:
- ఇంజనీరింగ్ విభాగానికి: 2,20,049 అప్లికేషన్లు
- అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాలకు: 86,493 అప్లికేషన్లు
- రెండు విభాగాలకూ కలిపి: 254 దరఖాస్తులు వచ్చాయి.
📌 ఫలితాలు, కీలు, రెస్పాన్స్ షీట్లు తదితర వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి:
👉 www.eapcet.tsche.ac.in
Read this also : నిరుద్యోగులకు శుభవార్త! ల్యాండ్ సర్వేయర్ లో శిక్షణ !
Read this also : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలు!