G-948507G64C
Home Careers డీఈడీ మళ్లీ డిమాండ్‌లోకి…

డీఈడీ మళ్లీ డిమాండ్‌లోకి…

0
5
Table of Contents

డీఈడీ మళ్లీ డిమాండ్‌లోకి… ఎస్‌జీటీ ఉద్యోగాల దారి సులభం!

హైదరాబాద్:,తెలంగాణ రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సు తిరిగి పూర్వ వైభవాన్ని అందుకుంటోంది. ఒకప్పుడు డీఈడీ అభ్యర్థులకు మాత్రమే ఎస్‌జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్టులు కేటాయించడమే దీనికి కారణమయ్యింది.

ఈ నేపథ్యంలో, ఈ సంవత్సరం డీఈఈసెట్ (DEECET 2024) కోసం దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మే 15 వరకు గడువు ఉన్నా, ఇప్పటికే దరఖాస్తుల సంఖ్య 26,000 దాటినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈసారి మొత్తం 30,000 దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఏం మారింది? ఎందుకు డీఈడీకి డిమాండ్ పెరిగింది?

2018లో, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) ఇచ్చిన ఆదేశాల ప్రకారం, బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్‌జీటీ పోస్టులకు అర్హులయ్యారు. దాంతో డీఈడీ కోర్సుకు డిమాండ్ తగ్గిపోయింది. అప్పట్లో రాష్ట్రంలో ఉన్న 219 ప్రైవేట్ డీఈడీ కళాశాలలు 79కు పడిపోయాయి. సీట్లు కూడా 11,250 నుంచి 4,100కి తగ్గిపోయాయి.

కానీ, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో, ఎస్‌జీటీ పోస్టులకు కేవలం డీఈడీ అభ్యర్థులకే అర్హత ఉందని స్పష్టమైంది. అదే ఈ కోర్సుకు తిరిగి గిరాకీ రావడానికి కారణమైంది.

వార్షిక డీఈఈసెట్ దరఖాస్తుల గణాంకాలు:

సంవత్సరం దరఖాస్తుల సంఖ్య

2019               25,584

2020               14,036

2021                 7,591

2022                11,680

2023                  6,485

2024                 17,655

2025                26,000+ (మే 1వ తేదీ వరకు)

ఎందుకు ఎస్‌జీటీ పోస్టులు ఆకర్షణీయంగా ఉన్నాయి?

DSC ద్వారా భర్తీ చేయబడే ఉపాధ్యాయ పోస్టుల్లో ఎక్కువ శాతం ఎస్‌జీటీ పోస్టులే.స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో కేవలం 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయబడతాయి, మిగిలినవి పదోన్నతుల ద్వారా.కానీ ఎస్‌జీటీ పోస్టులన్నీ 100% డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారానే భర్తీ అవుతాయి.2024 DSC నోటిఫికేషన్‌లో ఉన్న 11,000 పోస్టుల్లో 7,000 వరకు ఎస్‌జీటీలు.కొన్ని జిల్లాల్లో పోటీ తక్కువగా ఉండటం విశేషం. ఉదాహరణకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్కో పోస్టుకి 2–3 అభ్యర్థులు మాత్రమే పోటీపడుతున్నారు.

మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా?

అభ్యర్థుల ఆశల ప్రకారం, ప్రస్తుతం ఉన్న DSC కాకుండా సాధారణ ఎన్నికలలోపు మరో DSC నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అందుకే బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఇప్పుడు డీఈడీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇక కుటుంబ సభ్యులను డీఈడీ చేయించేందుకు కూడా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారంటూ, డీఈడీ-బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి తెలిపారు.

వైపు మార్చిన విద్యా విధానంతో డీఈడీ కోర్సు తిరిగి పాపులర్ అవుతోంది. ఉద్యోగ భద్రతతో పాటు ప్రత్యక్ష నియామక అవకాశాల వల్ల ఈ కోర్సు డిమాండ్ లోకి రావడం విద్యార్థులకు, కోచింగ్ సెంటర్లకు కొత్త జోష్ ఇస్తోంది..

మరిన్ని వాటి కోసం:- http://Www.telanganaexams.com

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here