July 22, 2020July 22, 2020 by VishnuM72 1. డిజిటల్ సమాచారాన్ని కాపీ చేయడం, మరొకరికి పంపడం వీలుకాని బ్లాక్ చైన్ టెక్నాలజీ అందిస్తున్న గ్లోబల్ ఇంటర్ వర్క్ అలయెన్స్ లో దేశంలోని ఏ జిల్లాకి సభ్యత్వం దక్కింది ? కృష్ణా జిల్లాముంబై జిల్లాబెంగళూరు జిల్లాహైదరాబాద్ జిల్లా 2. 2020 జులై 21న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ (85) అనారోగ్యంతో చనిపోయారు. అయితే ఆయన బీజేపీలో ఏ రాష్ట్రానికి చెందిన రాజకీయాల్లో గతంలో కీలకంగా వ్యవహరించారు ? ఉత్తర్ ప్రదేశ్మహారాష్ట్రరాజస్థాన్మధ్యప్రదేశ్ 3. గూగుల్ ట్యాక్స్, డిజిటల్ ట్యాక్స్ గా పాపులర్ అయిన ఈక్వలైజేషన్ లెవీ నుంచి భారత ప్రభుత్వం ఇప్పటి దాకా దాదాపు రూ.4 వేల కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ట్యాక్స్ ను ఎప్పటి నుంచి ప్రవేశపెట్టారు ? 2016-172019-202020-212018-19 4. తమ కంపెనీ టెక్నాలజీ సెంటర్ ను భారత్ లో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ వీడియో కమ్యునికేషన్స్ ప్రకటించింది ? ముంబైబెంగళూరుహైదరాబాద్విశాఖపట్నం 5. మధు బాబు పెన్షన్ యోజన కింద ట్రాన్స్ జెండర్లకి ఫించన్ ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? బిహార్ఒడిశాగోవాపంజాబ్ 6. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కి ఒకే రోజు ( 2020 జులై 21నాడు) 13 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.97వేల కోట్ల లాభం వచ్చింది. కరోనా టైమ్ లో ఆన్ లైన్ షాపింగ్ ట్రెండ్ పెరగడంతో ఏ దేశ షేర్ మార్కెట్ లో అమెజాన్ షేర్లు పెరిగాయి ? ఇండియాఅమెరికాఆస్ట్రేలియాబ్రిటన్ 7. దేశంలోనే మొదటిసారిగా విద్యుత్ లైన్లను పర్యవేక్షించడానికి డ్రోన్స్ వాడాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ? హరియాణాగోవామధ్యప్రదేశ్మహారాష్ట్ర 8. తెలంగాణలో ద్వితీయస్థాయి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమలను విస్తరించేందుకు రూ.36 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 2020 జులై 21నాడు ఎక్కడ ప్రారంభించారు ? ఖమ్మంకరీంనగర్వరంగల్నిజామాబాద్ 9. 2020 జులై 22నాడు ఇండియా ఐడియాస్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతున్నారు. అయితే ఈ సదస్సు భారత్ ఏ దేశం మధ్య జరుగుతోంది ? బ్రిటన్ఫ్రాన్స్అమెరికాజపాన్ 10. (IBPS&SBI POs-2020) కరోనా చికిత్స కోసం సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు అందుబాటులోకి తెచ్చిన కరోనా కవచ్ ను ఇకపై గ్రూప్ ఇన్సూరెన్స్ గా ఇచ్చేందుకు IRDAI అంగీకరించింది. అయితే కరోనా కవచ్ పాలసీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ? 2020 జులై 122020 జులై 152020 జులై 102020 జులై 14 11. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రను రద్దు చేసినట్టు శ్రీ అమర్ నాథ్ ఆలయ మండలి నిర్ణయించింది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెట్ గవర్నర్ తో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు ? జీసీ ముర్ముకిరణ్ బేడీరాధా క్రిష్ణ మాధుర్అనిల్ బైజ్వాల్ 12. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ జోరామ్ మెగా ఫుడ్ పార్క్ ను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ? నాగాలాండ్మణిపూర్మిజోరాంసిక్కిం Loading... Post Views: 1,060 Related Posts:JULY CURRENT AFFAIRS QUIZ 8JULY CURRENT AFFAIRS QUIZ – 14JULY CURRENT AFFAIRS QUIZ -7JULY CURRENT AFFAIRS QUIZ – 9JULY CURRENT AFFAIRS QUIZ – 10JULY CURRENT AFFAIRS QUIZ -11